‘మైదాన్’ వాయిదా... అజయ్ ఇంకేం చేస్తున్నారు?
on Jun 7, 2023
కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచీ పాజిటివ్ రీజన్స్తో వార్తల్లో ఉంటే, మరికొన్ని సినిమాలు మాత్రం నెగిటివ్ రీజన్స్తో వైరల్ అవుతాయి. సెకండ్ కేటగిరీ మూవీ మైదాన్. అజయ్ దేవ్గన్ హీరోగా నటించారు. ఇందులో ఫస్ట్ ఫీమేల్ లీడ్ చాయిస్ కీర్తీసురేష్. కానీ, ఆమె ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. నో చెప్పేశారు. తర్వాత ఇంకో నటిని రీప్లేస్ చేసి మూవీని కంప్లీట్ చేశారు. ఇప్పటికి ఈ సినిమా విడుదల ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలుసా? ఏడు సార్లు. ఆల్రెడీ ఈ ఏడాది బోళాతో సక్సెస్ చూసిన అజయ్, ఇప్పుడు మైదాన్తో సూపర్డూపర్గా సక్సెస్ని కంటిన్యూ చేస్తారని అనుకున్నారు. అంతా బావుంటే ఈ నెల 23న విడుదల కావాల్సింది మైదాన్. అయితే ఇది కావడం లేదు కాబట్టి, అజయ్ మిగిలిన సినిమాల మీద ఫోకస్ పెంచారు నార్త్ ఆడియన్స్. అజయ్ దేవ్గణ్, జ్యోతిక, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో గుజరాతీ సినిమా వష్ హిందీలో రీమేక్ అవుతోంది. వికాస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల్లోనే స్టార్ట్ కానుంది. 45 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది.
అజయ్, టబు సక్సెస్ఫుల్ కాంబోగా మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకుంటున్నారు. వీరి కాంబోలో ఔరాన్ మే కహా ధూమ్ థా తెరకెక్కనుంది. ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. టబు పార్ట్ పూర్తయింది. దివాళికి విడుదల చేయాలన్నది ప్లాన్. అజయ్ , రోహిత్ శెట్టి కలిసి మళ్లీ సింగం3ని ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వచ్చే ఏడాది స్వాతంత్రదినోత్సవం రోజు సినిమా విడుదలవుతుంది. దీపిక పదుకోన్ ఈ సినిమాలో లేడీ సింగంగా కనిపిస్తారు. కరీనా కూడా కీ రోల్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటు అభిషేక్ కపూర్ నెక్స్ట్ సినిమాలోనూ అజయ్ యాక్ట్ చేస్తున్నారు. అజయ్ నెఫ్యూ అమన్ దేవ్గన్, రవీనా టాండెన్ కూతురు రాషా తడానీ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతారనే వార్తలున్నాయి.